భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా కంకుల మిల్లర్​​ మీద పడి మహిళ మృతి

భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లా కంకుల మిల్లర్​​ మీద పడి మహిళ మృతి
  •       మెషీన్​ పడిపోతుండగా పట్టుకోబోగా ప్రమాదం

గుండాల, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం గోరకలమడుగులో శుక్రవారం కంకుల మిల్లర్ మీద పడి ఓ మహిళ చనిపోయింది. సీఐ రవీందర్, మృతురాలి భర్త చంద్రయ్య కథనం ప్రకారం..గ్రామానికి చెందిన ఈసం రమణ( 36)కు చెందిన కంకుల మిల్లర్​ను చేను నుంచి ట్రాక్టర్​కు కట్టి డ్రైవర్ ​తీసుకువెళ్తున్నాడు. దీని వెనక రమణ నడిచి వెళ్తోంది.

అడవిలో డౌన్ ఉన్న దగ్గర మెషీన్​ఓవైపు ఒరిగి పల్టీ కొట్టబోతుండగా రమణ రెండు చేతులు పెట్టి ఆపే ప్రయత్నం చేసింది. బరువు ఎక్కువగా  ఉండడంతో మిల్లర్​ మీద పడి అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు. కాచనపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.