జగిత్యాలలో బురఖాలో వచ్చి గోల్డ్ రింగ్ చోరీ

జగిత్యాలలో  బురఖాలో వచ్చి గోల్డ్ రింగ్ చోరీ

జగిత్యాల టౌన్, వెలుగు: బురఖా ధరించి ఓ జ్యువెల్లరీ షాప్​కు వచ్చిన మహిళ గోల్డ్​రింగ్​చోరీ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల టవర్ సర్కిల్‌‌‌‌‌‌‌‌ లోని రాగి శ్రీకాంత్ జ్యువెల్లరీ దుకాణానికి ఆదివారం బురఖాలో ఓ మహిళ వచ్చింది. ఖరీదైన ఉంగరాలు చూపించమని కోరింది. 

సిబ్బంది కొన్నింటిని ఆమె ముందు ఉంచగా.. వాటిని పరిశీలిస్తున్నట్లే చేసి, వెంట తెచ్చుకున్న నకిలీ రింగును అక్కడ పెట్టి, గోల్డ్ రింగ్ ను ఎత్తుకెళ్లింది. కాసేపటికి గుర్తించిన సిబ్బంది యజమాని అఖిల్​కు సమాచారం అందించారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్​పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీలో నిందితురాలి దృశ్యాలు  కనిపించాయి.