నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ముషంపల్లి గ్రామంలో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు ఇద్దరు దుండగులు. మహిళ వివస్త్రను చేసి దారుణంగా చంపి.. పరారయ్యారు. ఈ ఘోరం చేసిన సమయంలో నిందితులిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది.
ఆ మహిళ ఒంటిపై ఉండాల్సిన బంగారు ఆభరణాలు మాయమ్యాయని, దీంతో మద్యం మత్తులో ఆభరణాల కోసమే హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు లింగయ్య, పుల్లయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.