ఛత్తీస్‌గడ్‌లో ఎదురుకాల్పులు..మహిళా మావో మృతి

ఛత్తీస్‌గడ్‌లో ఎదురుకాల్పులు..మహిళా మావో మృతి

ఛత్తీస్‌గడ్‌లో మరోసారి మావోయిస్టులకు, భద్రత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గుమ్మలనూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పులలో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. కాల్పుల్లో చనిపోయిన మహిళా మావోయిస్టుపై 2 లక్షల రూపాయల రివార్డు ఉంది.ఆమెపై దంతేవాడ జిల్లాలోని గీడం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదై ఉంది. ఎన్ కౌంటర్ జరిగిన విషయాన్ని SP అభిషేక్ పల్లవ్ తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో ఆయుధాలతో పాటు వారికి సంబంధించిన కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.