ఏంటమ్మ ఈ శాపనార్థాలు.. బీఆర్ఎస్ను ఓడించారని తిట్టింది

ఏంటమ్మ ఈ శాపనార్థాలు.. బీఆర్ఎస్ను ఓడించారని తిట్టింది

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిని వోడితల సతీష్ కుమార్ ను బీఆర్ఎస్ నాయకులే ఓడించారని.. వారంతా పురుగులు పడి సచ్చిపోతారని స్వరూప అనే మహిళ తిడుతూ.. వీడియో తీసి మంగళవారం 2023 డిసెంబర్ 5న వాట్సప్ గ్రూపులో షేర్ చేసింది. దీంతో ఈ విడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఎన్నికల సమయంలో కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని ప్రజలకు పంచకుండా వాళ్లే పంచుకున్నారని శాపనార్థాలు పెట్టింది. కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణను.. తండ్రిలాంటి కేసీఆర్ ను ఒడగొట్టారని వెక్కి వెక్కి ఏడుస్తూ.. బీఆర్ఎస్ నాయకులను తిట్టింది. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారని వాపోయింది. ప్రజలారా మీరే ఆలోచించండి.. ఇన్ని రోజులు పాలించిన కేసీఆర్ ని మీరే దూరం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.