
ఒక్కసారి సమాధి అయితే ఇక అంతే. బతికుండే ఛాన్స్ ఉండదు. అది కూడా బతికుండా సజీవ సమాధి అయినా కూడా అంతే. ఆ టైంలో లక్కీగా ఎవరైనా గమనిస్తే బతికే అవకాశం ఉంటుందేమో గానీ సమాధి అయిన తర్వాత అందుకు అస్సలు అవకాశం ఉండదు. అలాంటిది ఓ మహిళ సమాధి అయినా కూడా.. 11 రోజులు వరకు ప్రాణాల కోసం పోరాడిందట. విషయం తెలుసుకుని చుట్టుపక్కల వాళ్లు, బంధువులు ఆమె సమాది వద్దకు చేరుకుని చూడగా..ఒక్కసారిగా అంతా నిర్ఘాంతపోయారు. ఈ వింత ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది.
కాళ్ల నుంచి చేతుల వరకు సరిగ్గా సరిపోయే చిన్న పెట్టెలో ఉండిపోయి.. సాయం కోసం అర్థిస్తూ ఎవరూ రాక ప్రాణాలు కోల్పోవడం.. వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదా.. బ్రెజిల్ (Brazil) లో ఇలాంటి దిగ్భ్రాంతికర ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఈశాన్య బ్రెజిల్లోని రిచాఓ దాస్ నెవాస్ నగరానికి చెందిన రోసంగేలా అల్మాండా (37) అనే మహిళకు గుండె పోటు రావడంతో మరణించిందని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె చనిపోయిందని భావించిన కుటుంబసభ్యులు ఆ దేహాన్ని శవపేటికలో పెట్టి సమాధి చేసేశారు. ఆ తర్వాత 11 రోజుల అనంతరం అటుగా వెళ్తున్న వారికి అందులోంచి శబ్దాలు రావడం, కాపాడమని అరుపులు వినపడటంతో వారు ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు.
అక్కడకి వచ్చి.. వారు శవపేటికను తెరచి చూసి ఆశ్చర్యపోయారు. కొంతమంది అక్కడే కూర్చుని గుండెలవిసేలా రోదించారు. శవపేటికలో పెట్టేటప్పుడు స్పృహలో లేని రోసంగేలా పూడ్చేసిన అనంతరం తెలివిలోకి (Alive in Coffin) వచ్చినట్లు అక్కడి పరిస్థితిని చూస్తే తెలుస్తోంది.
వెలికితీయగా బంధువులంతా అల్మెడాని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆమె శరీరరం వేడిగా ఉండి శ్వాస తీసుకోవడం చూసి షాక్ తిన్నారు. ఐతే ఇక్కడ జరిగిన మరో షాకింగ్ విషయం ఏంటంటే ఆమెను ఖననం చేసినప్పుడూ వంటిపై గాయాలు లేవు. కానీ ఇప్పుడూ చూస్తే నుదిటిపై మణికట్టుపనై తీవ్ర గాయాలు ఉన్నాయి. కొంతమంది సాక్ష్యుల సైతం ఆమె చనిపోయి ఉండకపోవచ్చని తాము చూసేటప్పటికీ.. ఆమె శరీరం వెచ్చగానే ఉందని చెప్పారు. ఆమెను బయటకు తీసిన వెంటనే అంబులెన్సులోకి తీసుకెళదామని ఒకరు, ప్రథమ చికిత్స అని మరొకరు ప్రయత్నించినప్పటికీ..ఇక ఆమె ప్రాణాలతో లేదని అక్కడే ఉన్న వైద్యులు నిర్ధరించారు. ఎవరూ కలలోకూడా ఊహించని దుర్భర స్థితిలో ఆమె ప్రాణాలు కోల్పోయిందని వారు తెలిపారు.
అయితే ఆమెను పూడ్చిపెట్టిన తర్వాత ఎన్ని రోజులకు స్పృహలోకి వచ్చిందో స్పష్టత లేదు. రోసంగేలాకు ఎనిమిదేళ్ల నుంచే ఉన్నట్టుండి స్పృహ కోల్పోయే వ్యాధి ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. చనిపోయే ముందు ఆమెకు రెండు సార్లు గుండెపోటు వచ్చిందని.. తను చనిపోయిందని చెప్పాకనే దేహాన్ని పూడ్చిపెట్టామని వాపోయారు
అల్మెడా సమాధి నుంచి బయటకు తీసిన తర్వాత సజీవంగా లేకపోవడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేయగా అవన్ని పుకార్లు అయ్యి ఉండొచ్చని కొట్టిపారేశారు. ఓ వ్యక్తి సమాధిని తవ్వి ఆమె ఆత్మకు శాంతి చేకూరకుండా భంగం కలిగించినందుకు గానూ ఆయా వ్యక్తులపై అభియోగాలు మోపి పోలీసులు అరెస్టు చేయడం కొసమెరపు. చివరికి విచారణలో అల్మెడాను సజీవంగా పాతిపెట్టలేదని నిర్థారించారు. అవన్నీ ఊహగానాలకింద తేల్చారు పోలీసులు. చివరికి ఈ షాకింగ్ ఘటన చిత్రవిచిత్రమైన ట్విస్ట్లతో టెన్షన్ రేకెత్తించి ఈ అంశం కాస్త చివరికి విషాదంగా ముగిసింది.