
ఫేస్ బుక్ ఫ్రెండ్ లంచ్ ఆహ్వానం.. ఓ మహిళను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది. జీవితం నాశనం ఆపై బ్లాక్ మెయిల్ తో జీవితాన్ని నాశనం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...
తెలియని వారితో పరిచయాలు.. లంచ్లు.. డిన్నర్ లు.. సినిమాలు.. షికార్లు.. మహిళలకు ఇబ్బంది తెస్తాయి. ఏదో టైంపాస్కు ల్యాప్ టాప్.. ఫోన్ లో ఫేస్ బుక్ను తిరగేస్తే చాలా మంది వ్యక్తులు తారసపడగారు. వారితో కొద్దిగా ఛాటింగ్ ద్వారా మాటా ముచ్చటి పెట్టుకుంటే జీవితం స్మాషే.. తీరా చేతులు కాలిన ఆకులు పట్టుకున్నట్టు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగినాక.. లబో దిబో మంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సరిగ్గా ఇప్పుడు అలానే తనను ఓ యువకుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బంజారా హిల్స్ పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే....
ఫేస్ బుక్ ద్వారా ఓ మహిళకు మహేంధ్ర వర్దన్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం( 2023) లో పరిచయ్యాడు. వారిద్దరూ ఉస్మానియా యూనివర్సిటీలో కలుసుకున్నారు. అప్పటినుంచి వారిమధ్యస్నేహం ప్రారంభమయింది. ఇక అంతే ఫ్రెండ్ షిప్ పేరుతో ఓ రోజు తన ఇంటికి లంచ్ కు ఆహ్వానించాడు. కేవలం ఆన్ లైన్ లో పరిచయంతోనే ఓ రోజు ఆ మహిళ బంజారాహిల్స్ రోడ్ నెం 7లో నివాసం ఉంటున్న మహేంద్రవర్మ నివాసానికి వెళ్లింది. ఇప్పుడే అసలు కథ ప్రారంభం అయింది.
2023 లో తన ఇంటికి భోజనానికి పిలిచిన మహేంద్రవర్థన్ ఆమెకు మత్తుమందు ఇచ్చాడు. మహిళ మత్తులోకి జారుకున్న తర్వాత .. లైంగిక దాడి చేశాడు. అంతటితో ఊరుకోకుండా వీడియో, ఫోటోలు తీసుకున్నాడు. ఇక అప్పటినుంచి బ్లాక్మెయిల్ చేస్తూ సదరు మహిళ దగ్గరి నుంచి డబ్బులు గుంజుతున్నాడు. అలా ఇప్పటివరకు రూ.20లక్షలు వసూలు చేసిన మహేంద్రవర్థన్ .. ఇప్పుడు తనకు రూ.1 కోటి ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ 64(1),308(2),351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చూశారా.. తెలియని వారితో పరిచయాలు.. అదీ కూడా నేరుగా కాకుండా.. ఆన్ లైన్ ఫ్రెండ్ షిప్ ఎంత దారుణాలకు దారితీస్తుందో.. ఇక నైనా ఇలాంటి ఘటనలు జరుగకుండా ఇంటర్ నెట్.. ఆన్ లైన్ వ్యవహారాలను ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకుంటే ఇలాంటి అనర్ధాలు జరగవని గ్రహించాలి.. .