గ్రామ పాలనలో కుటుంబీకుల జోక్యం వద్దు : కలెక్టర్ ఇలా త్రిపాఠి 

గ్రామ పాలనలో కుటుంబీకుల జోక్యం వద్దు : కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నిజామాబాద్, వెలుగు:  గ్రామ పంచాయతీ పాలనలో కుటుంబీకుల జోక్యం లేకుండా మహిళా సర్పంచ్​లు పాలన సాగించాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచ్​లకు ఐదు రోజుల ట్రైనింగ్​ను  కలెక్టర్​ ప్రారంభించి మాట్లాడారు. పంచాయతీ చట్టాలపై అవగాహన పెంచుకొని సొంత నిర్ణయాలతో ఫస్ట్​ సిటిజన్​ గౌరవం పొందాలని, ఇతరుల జోక్యంతో చులకనవడమే కాకుండా నేర్చుకోవాలనే అభిరుచి కోల్పోతారన్నారు.

తాగునీరు, శానిటేషన్​, వీధి రోడ్లు, విద్య, వైద్యం తదితర అంశాలపై ఫోకస్​ పెట్టాలన్నారు. హాస్టల్స్​, కాస్తూర్బా, రెసిడెన్షియల్ స్కూల్స్​ విజిట్​ చేసి లోటుపాట్లు ఉంటే ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.  గవర్నమెంట్​ భూములు ఆక్రమణనకు గురికాకుండా చూడడం, కొత్త ఆలోచనలతో పల్లె ప్రగతికి పాటుపడాలన్నారు. ఈ విషయంలో తమ సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ప్రతి ఏటా పది మంది ఉత్తమ మహిళా సర్పంచ్​లను గుర్తించి సన్మానించడమే కాకుండా ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందిన గంగాదేవీపల్లి టూర్​కు పంపుతామన్నారు. డీపీవో శ్రీనివాస్​రావు, ఏవో రాజాబాబు, మాస్టర్​ ట్రైనర్లు ఉన్నారు.