78 డివిజన్లలో మహిళల గెలుపు

78 డివిజన్లలో మహిళల గెలుపు
  •     అందులో 3 అన్‌రిజర్వ్​డ్ వార్డులోనూ విన్
  •     టీఆర్‌‌ఎస్​లో 28 మంది.. బీజేపీలో 26 మంది విజయం
  •     కాంగ్రెస్​లో గెలిచిన ఇద్దరూ మహిళలే..

హైదరాబాద్‌, వెలుగు: గ్రేటర్‌‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో మహిళా పొలిటీషియన్లు సత్తా చాటారు. 78 డివిజన్లలో  గెలిచారు. టీఆర్‌‌ఎస్  నుంచి 28 మంది మహిళా నేతలు విజయం సాధించారు.  బీజేపీ నుంచి 26 మంది, ఎంఐఎం నుంచి 21 మంది గెలిచారు. కాంగ్రెస్​కు మొత్తంగా రెండు సీట్లు దక్కగా.. ఆ రెండింటిలోనూ మహిళలే గెలవడం గమనార్హం. ఆ పార్టీ నుంచి ఉప్పల్‌ డివిజన్‌లో ఎం.రజిత, ఏఎస్‌ రావు నగర్‌‌ డివిజన్‌లో శిరీషారెడ్డి విజయం సాధించారు. ఇక అన్‌రిజర్వ్​డ్ స్థానాల్లో ముగ్గురు మహిళలు గెలుపొందారు. ప్రస్తుత మేయర్‌‌ బొంతు రామ్మెహన్ భార్య శ్రీదేవి యాదవ్..చర్లపల్లిలో, టీఆర్‌‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు కుమార్తె విజయలక్ష్మి.. బంజారాహిల్స్​లో, దేదీప్యరావు వెంగళరావ్‌నగర్‌‌లో విన్ అయ్యారు. ఈ ముగ్గురూ  మేల్‌ లీడర్లతో తలపడి గెలిచారు. ఇక నేరెడ్‌మెట్ డివిజన్‌ మహిళలకే కేటాయించగా, అక్కడ బీజేపీ, టీఆర్‌‌ఎస్‌ లీడర్ల నడుమ హోరాహోరీ పోరు జరిగింది. ఓట్ల లెక్కింపులో జరిగిన పొరపాటుతో ఆ డివిజన్‌ ఫలితాన్ని అధికారులు ప్రకటించలేదు.