ఢిల్లీ మెట్రోలో మహిళలకు కుస్తీ పోటీలు పెట్టారా..?

ఢిల్లీ మెట్రోలో మహిళలకు  కుస్తీ  పోటీలు పెట్టారా..?

ఈ మధ్య కాలంలో ఢిల్లీ మెట్రో నిత్యం వార్తల్లో నిలుస్తుంది.  ప్రయాణికులు చేసే ఏదో ఒక చర్య వైరల్ అవుతూనే ఉన్నాయి. ఢిల్లీ మెట్రోలో రొమాన్స్, ఫన్నీ డ్యాన్సులు, ఫైటింగ్‌లు లాంటి వీడియోలు చేసి నెట్టింట పోస్ట్‌ చేస్తుంటారు.సోషల్ మీడియాలో వ్యూస్‌కోసం, లైకులు, షేర్ల కోసం చాలా మంది తమ టాలెంట్‌ను ప్రదర్శించటానికి ఢిల్లీ మెట్రోనే వేదికగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని అనుకోని సంఘటనలు కూడా ఢిల్లీ మెట్రోను వార్తల్లోకెక్కిలా చేస్తుంది. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ కంటే మెట్రో ఇప్పుడు మరింత వినోదాత్మకంగా మారిందని సోషల్ మీడియా యూజర్లు చెప్పడం మొదలుపెట్టారు.. తాజాగా కొంతమంది మహిళల మధ్య సీటు కోసం గొడవ జరిగింది.. సీటు కోసం భీకర యుద్ధం చేశారు.. ఆ గొడవ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఆగస్టు 22న పోస్టు అయిన వీడియోలో కొంతమంది మహిళల మధ్య గొడవ జరిగింది.  ఈ వీడియో వైరల్ కావడంతో లైక్ లు, కామెంట్లతో హోరెత్తించారు.  దీనిని ఇప్పటి వరకు 90 వేలకు పైగా జనాలు వీక్షించారు. దీనిపై జనాలు స్పందించారు.  ఏంటీ బ్రో ఈ దారుణం సీటు కోసం బట్టలు చిరిగేలా కొట్టుకోవాలా అంటూ కామెంట్ చేశారు.  మరికొందరు సినిమాల్లో ఫైటింగ్ సీన్లలో నటిస్తే  బాగుంటుందని కామెంట్ పెట్టారు. ఏది ఏమైనా ఢిల్లీ మెట్రోలో ప్రయాణం కొంతమందికి ఎంటర్ టైన్ మెంట్ గా ఉంటే మరికొందరి ఇదేమి ప్రయాణం రా బాబూ అనుకుంటున్నారు.  మెత్తానికి తాజాగా ఢిల్లీ  మెట్రోలో తీసిన వీడియో తెగ వైరల్ అవుతుంది.