- సుప్రీంకోర్టుకు చెప్పిన రక్షణ శాఖ
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మే నెలలో నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్ష ద్వారా మహిళా అభ్యర్థులను డిఫెన్స్ సర్వీస్లోకి తీసుకోనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. యూపీఎస్సీ ఏడాదికి రెండు సార్లు ఎన్డీఏ ఎగ్జామ్ నిర్వహిస్తోందని, 2022 మే నెలలో వెలువడే నోటిఫికేషన్ ద్వారా మహిళా అభ్యర్థులను అనుమతిస్తామని సుప్రీంకు అఫిడవిట్సమర్పించింది. మహిళలను డిఫెన్స్ సర్వీసులోకి అనుమతించకపోవడంపై గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్దాఖలైన విషయం తెలిసిందే. ఈమేరకు మహిళలను అనుమతిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్మొదటి వారంలో జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం కోర్టుకు తెలిపింది. కాగా దేశంలో మహిళలకు శాశ్వత కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేస్తారనే దానిపై కేంద్రాన్ని టైమ్లైన్ కోరిన సుప్రీం.. మహిళలను డిఫెన్స్సర్వీస్లోకి తీసుకునేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. ఈమేరకు కేంద్ర రక్షణ శాఖ సుప్రీంకు అఫిడవిట్సమర్పించింది. మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు టైమ్లైన్ ను దృష్టిలో ఉంచుకున్నామని, వచ్చే మే నాటికి మహిళా అభ్యర్థులకు అవసరమైన శిక్షణాపరమైన కరికులం, ప్రణాళికను రూపొందించేందుకు ఎక్స్పర్ట్స్ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు అఫిడవిట్లో సుప్రీంకు తెలిపింది.