
మాదాపూర్, వెలుగు : మాదాపూర్లోని మెడికవర్ హాస్పిటల్లో డెంటల్ డాక్టర్లకు గురువారం వర్క్ షాప్ నిర్వహించారు. వివిధ హాస్పిటల్స్కు చెందిన సుమారు 100 మందికిపైగా డెంటిస్ట్లు హాజరయ్యారు.
మెడికవర్ హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి, స్పీకర్స్గా యూకే నుంచి డాక్టర్ మినాస్ లెవెన్స్కీ, డాక్టర్ జోహన్ తో సహా ప్రఖ్యాత నిపుణులు స్పీకర్స్ గా పాల్గొని దంత వైద్యంలో లేటెస్ట్ టెక్నాలజీ గురించి వివరించారు.