సిటీలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎఫెక్ట్ కనిపించింది. సండే కావడంతో సిటీవాసులు తమ ఇండ్లలోనే ఉండి మ్యాచ్ ను చూశారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు ఉండగా మ్యాచ్ ఎఫెక్ట్ ప్రచారంపైనా పడింది. చాలా మంది అభ్యర్థులు తమ ప్రచారాన్ని మధ్యాహ్నమే ముగించారు. దీంతో అభ్యర్థుల ప్రచారాలతో హడావిడిగా ఉండే సిటీ రోడ్లు ఖాళీగా కనిపించాయి. అంబర్పేట్లో జరగాల్సిన రోడ్షోను కేటీఆర్ రద్దు చేసుకున్నారు. మల్కాజ్గిరి ప్రచారంలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిగ్ స్ర్కీన్పై క్రికెట్ను వీక్షించారు.
ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్క్ తదితర టూరిజం స్పాట్లు వెలవెలబోయాయి. సినిమా థియేటర్లలో ప్రేక్షకులు లేక ఖాళీగా దర్శనమిచ్చాయి. పెళ్లిళ్లు ఎక్కువగా ఉండగా ఫంక్షన్ హాళ్లలో బిగ్ స్ర్కీన్లను ఏర్పాటు చేసుకుని చూశారు. అదేవిధంగా వికారాబాద్ లో బరాత్ లో భాగంగా నూతన దంపతులు కారులో వెళ్తూ.. మ్యాచ్ ను వీక్షించారు. వెలుగు, హైదరాబాద్