దేశ వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కొనసాగుతోంది. ఏప్రిల్ 19న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది. సెలబ్రిటీలతో పాటు పలువురు ప్రముఖులు ఆయా ప్రాంతాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత పొట్టి మహిళ జ్యోతి అమ్గే(30) నాగ్పూర్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. తన ఫ్యామిలీతో కలిసి ఓటు వేశానని చెప్పారు. ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు వేయాలని ..ఇది మన కర్తవ్యం అని చెప్పారు. పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చిన ఆమెను చూసేందుకు ఓటర్లు గుమి గూడారు.జ్యోతి ఓటు వేయడం ఇది తొలిసారి కాదు..2019 లోక్ సభ ఎన్నికల్లో కూడా ఓటు వేశారు.
జ్యోతి ఆమ్గే 1993 డిసెంబర్ 16న జన్మించారు .ఆమె రెండు అడుగుల ఏడు అంగుళాల పొడవుతో ప్రపంచంలో పొట్టి మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది. నటి, మోడల్ అయిన జ్యోతి పలు టెలివిజన్ షోలో నటించారు.
#WATCH | Maharashtra: World's smallest living woman, Jyoti Amge cast her vote at a polling booth in Nagpur today. #LokSabhaElections2024 pic.twitter.com/AIFDXnvuvk
— ANI (@ANI) April 19, 2024