
హైదరాబాద్, వెలుగు: ఇండియా స్టార్ అథ్లెట్, తెలుగమ్మాయి యెర్రాజి జ్యోతి వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో మెరిసింది. విమెన్స్ 100 మీటర్ల హర్డిల్స్లో నేషనల్ రికార్డు బ్రేక్ చేస్తూ బ్రాంజ్ మెడల్ సాధించింది. చైనాలోని చెంగ్డూ సిటీలో శుక్రవారం జరిగిన ఫైనల్లో జ్యోతి 12.78 సెకండ్లతో మూడో స్థానంతో పోడియంపైకి వచ్చింది. పర్సనల్ బెస్ట్ టైమింగ్తో తన పేరిటే ఉన్న నేషనల్ రికార్డు బ్రేక్ చేసింది. కానీ, పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ టైమింగ్(12.77 సె)ను కేవలం 0.01 సెకండ్ తేడాతో మిస్ అయింది.