
న్యూఢిల్లీ: కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలు దాటాయి. ఇందులో ఒక్క యూరప్లోనే 10 లక్షల కేసులున్నా యి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదైన దేశాల్లో అమెరికా టాప్లో ఉంది. మరణా ల్లోనూ ముందే ఉంది. ఇక్కడ ఇప్పటివరకు6 లక్షలకు పైగా కేసులు, 27 వేలకు పైగా మరణాలు నమోద య్యాయి. మొత్తం కేసుల్లో స్పెయిన్ రెండో స్థానంలో (1,77,633), ఇటలీ మూడో ప్లేస్లో (1,65,155) ఉన్నాయి. బ్రిటన్లో కేసులు లక్షకు చేరువయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 1.31 లక్షల మంది వైరస్ బారిన పడి చనిపోయారు. అమెరికాలో 27 వేలు, ఇటలీలో 21 వేలు, స్పెయిన్లో 18 వేల మందికిపైగా మరణిం చారు. న్యూయార్క్లో 10,842 మంది చనిపోయా రు. రికార్డు స్థాయిలో ఒక్క రోజులోనే అమెరికాలో 2,129 మంది చనిపోయారు.
కరోనా కరోనానే..
ఎన్నికలు ఎన్నికలే ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేస్తున్నా దక్షిణ కొరియా మాత్రం జాతీయ అసెంబ్లీ ఎన్ని కలను నిర్వ హించింది. బుధవారం లక్షల్లో జనం ఓటేయడాని మాస్కులతో పోలింగ్ బూత్లకు వచ్చారు. వచ్చినళ్లకు వచ్చిన టెంపరేచర్ చెక్చేశారు. 37.5 డిగ్రీల కు మించి ఉష్ణో గ్రత ఉంటే ప్రత్యేక బూత్లకు తీసుకెళ్లి ఓటేయించారు. చేతులను డిసిన్ఫెక్ట్చేశాకే ఓటేసేలా సౌకర్యాలు కల్పించారు. డిసిన్ ఫెక్ట్ చేసుకున్నాక ఓటేసేందుకు ప్లాస్టిక్ గ్లౌజులు అందించా రు. సుమారు 1.5 కోట్ల మంది ఓటేశారని అధికారులు వెల్లడించా రు. ఇది 2004 జనరల్ ఎలక్షన్ల కన్నా ఎక్కువన్నా రు. వైరస్ సోకి క్వారంటైన్లో ఉన్న వాళ్లకూ ఓటేసే వెస లుబాటు కల్పించారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటలకు వరకే ఓటేసేలా ప్లాన్చేశారు. ఆ 6 రోజులు జనాన్ని చైనా హెచ్చరించలే ఏదో ఓ పాండెమిక్ చైనాలో ఎక్కువవుతోందని ఉన్నతాధికారులకు జనవరి 14న తెలిసినా తర్వాత 6 రోజుల వరకు ఎలాంటిచర్యలు తీసుకోకపోవడం తో కరోనా వైరస్ విజృంభించడం ఎక్కువైం దని ఓ ఇంటర్నేషనల్ డాక్యుమెంట్ వెల్లడించిం దని అసోసి యేట్ప్రెస్చెప్పింది. ఆ ఆరు రోజుల్లోనే లూనార్న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం లక్షల్లో జనం రకరకాల ప్రాంతాలకు తరలి వెళ్లారంది. ఏడో రోజున (జనవరి 20న) ప్రెసిడెంట్జిన్పింగ్ప్రజలకు విషయం చెప్పి హెచ్చరించారని రాసుకొచ్చింది. కరోనా రాక్షసి విల యతాండవం చేస్తున్నా స్పెయిన్, ఆస్ట్రియాల్లో కొన్ని పనులకు అక్కడి ప్రభుత్వాలు ఓకే చెప్పాయి. కాస్త సడలింపులిచ్చాయి. మరోవైపు మనదేశం, బ్రిటన్, ఫ్రాన్స్,పాకిస్థాన్లాక్డౌన్ను పొడిగించా యి. డెన్మార్క్లో స్కూళ్లు మొదలైనయ్ యూరోపియన్ దేశాల్లో ఎడ్యుకేషన్కు సడలింపుని చ్చిన తొలి దేశంగా డెన్మార్క్ నిలిచింది. 11 ఏండ్ల లోపు పిల్లలు స్కూళకు వెళ్లొచ్చని అక్కడి సర్కారు పేర్కొంది. 6,500కు పైగా కేసులు నమోదయ్యాయి. 300 మందికిపైగా చనిపోయారు.
రాష్ట్రాల ఇష్టం:
ట్రంప్ అమెరికాలో లాక్ డౌన్ ఎత్తివేత, వ్యాపార సంస్థలు, కంపెనీలను తిరిగి ప్రారంభించడం వంటివిషయాలపై నిరయా్ణ న్ని ఆయా రాష్ట్రాల గవర్నర్లకే వదిలేశామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నా రు. కొన్ని రాష్ట్రాల్లో మే 1 కన్నా ముందే లాక్ డౌన్ ఎత్తివేయొచ్చని చెప్పారు. ‘‘లాక్ డౌన్ ఎత్తివేతపై విధివిధా నాలు దాదాపుగా ఖరారయ్యాయి. వాటిని త్వరలోనే వెల్ల డిస్తాం. ప్రతి రాష్ట్రం సొంతంగా ఒక పవర్ ఫుల్ రీఓపెనింగ్ ప్లాన్ అమలు చేయాలని కోరతా’’ అని ఆయన వెల్లడించా రు. ప్రస్తుం 20 రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగ్గానే ఉందన్నా రు.