
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ 2023లో థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఆసీస్కు ఫేవర్గా అతడు నిర్ణయం తీసుకోవడమే అందుకు కారణం. టీ బ్రేక్కు ముందు శుభ్మన్ గిల్.. బోలాండ్ ఓవర్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న గ్రీన్ డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. వెంటనే ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో.. ఆన్ఫీల్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. అయితే గిల్ డీఆర్ఎస్ కోరడంతో ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్కు రిఫర్ చేశాడు. టీవీ రిప్లైలో గ్రీన్ క్యాచ్ పట్టేముందు బంతి నేలను తాకినట్టు స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ.. థర్డ్ అంపైర్ గిల్ ఔట్ అన్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
థర్డ్ అంపైర్ నిర్ణయం పట్ల ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'గ్రీన్ క్యాచ్ అందుకునే ముందు బంతి నేలను తాకినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అయినా థర్డ్ అంపైర్ మాత్రం అవుట్గా ప్రకటించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. గిల్తో పాటు రోహిత్ శర్మ కూడా ఈ నిర్ణయంతో చాలా నిరుత్సాహ పడ్డారు..' అని రికీ పాంటింగ్ కామెంట్ చేశాడు.
https://twitter.com/abhiiru45/status/1667550811340300288
థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని భారత అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. ఆస్ట్రేలియాకి అనుకూలంగా నిర్ణయం ప్రకటించాడని కొందరు కామెంట్ చేస్తుండగా, కళ్లు మూసుకుని పనిచేస్తున్నాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా, ఫీల్డ్ అంపైర్ 'సాఫ్ట్ సిగ్నల్' రూల్ను ఐసీసీ ఇటీవల తొలగించిన సంగతి తెలిసిందే. 'సాఫ్ట్ సిగ్నల్' ప్రకారం.. స్పష్టమైన ఆధారాలు లేనప్పుడు ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని బట్టి థర్డ్ అంపైర్ కూడా అవుట్ ఇచ్చేవాడు.