V6 News

అన్ని హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.. పీహెచ్సీల్లో స్క్రీనింగ్ పెంచాలి

అన్ని హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.. పీహెచ్సీల్లో స్క్రీనింగ్ పెంచాలి
  • యాదాద్రి కలెక్టర్​ అనురాగ్​ జయంతి 

యాదాద్రి, వెలుగు :  క్లినికల్​ ఎస్టాబ్లిష్​మెంట్​ యాక్ట్​ 2010 ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్​ హాస్పిటల్స్​ రిజిస్ట్రేషన్​ చేయించుకోవాలని యాదాద్రి కలెక్టర్​ అనురాగ్​ జయంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశంలో జిల్లాలో ఉన్న హాస్పిటల్స్, వాటిలో  రిజిస్ట్రేషన్ చేయించుకున్నవి, చేయించుకోని  ఎన్ని ఉన్నాయో ​కలెక్టర్​ ఆరా తీశారు. 

అప్లికేషన్​ చేసుకున్న వాటిలో ఎన్ని పెండింగ్​లో ఉన్నాయని డీఎంహెచ్​వో డాక్టర్​ మనోహర్​ను  ఆయన ప్రశ్నించారు. దీంతో అప్లికేషన్​ చేసుకున్న వాటిలో ఇంకా 17 పెండింగ్​లో ఉన్నాయని డీఎంహెచ్​వో తెలిపారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడారు. అప్లికేషన్​ చేసుకొని పెండింగ్​లో ఉన్న 17 హాస్పిటల్స్​లో మే 7 లోపు తనిఖీలు చేసి రిపోర్ట్​ ఇవ్వాలని సూచించారు. 

రిజిస్ట్రేషన్​ కోసం వచ్చిన హాస్పిటల్స్​ అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఎన్​సీడీ కార్యక్రమంలో పనితీరు సరిగా లేని పీహెచ్​సీల్లో స్క్రీనింగ్​ పెంచాలన్నారు. హాస్పిటల్స్​ మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పెండింగ్​లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.