యాదాద్రి, వెలుగు: పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ప్రతి వాహనాన్ని తప్పని సరిగా చెక్ చేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. యాదాద్రి జిల్లా వలిగొండలోని చెక్పోస్ట్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోజు ఎన్ని వాహనాలను తనిఖీ చేశారో అడిగి తెలుసుకున్నారు. దారిలో వెళ్లే ప్రతి వాహనం చెక్ చేస్తూ వీడియో తీయించడంతో పాటు వాటి వివరాలు నమోదు చేయాలన్నారు. రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు ఉంటే సీజ్ చేయాలన్నారు.
