యాదాద్రి హుండీ ఆదాయం రూ. 68.45 లక్షలు

యాదాద్రి హుండీ ఆదాయం రూ. 68.45 లక్షలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను మంగళవారం సిబ్బంది హరిత టూరిజం హోటల్​లో లెక్కించారు. ఏడు రోజుల్లో రూ.68,45,573 నగదు, 33 గ్రాముల బంగారం, 970 గ్రాముల వెండి వచ్చిందని ఈఓ గీతారెడ్డి చెప్పారు. అమెరికా కరెన్సీ 137 డాలర్లు, సౌదీ అరేబియా కరెన్సీ 175 రియాల్స్, కెనడా కరెన్సీ 10 డాలర్లు, ఖతార్ కరెన్సీ ఒక రియాల్ వచ్చాయి. భక్తులు నిర్వహించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా మంగళవారం ఆలయానికి రూ.15,54,728 ఆదాయం వచ్చిందని ఆఫీసర్లు తెలిపారు.