- ఒక్క నెలలోనే రూ. 137.98 కోట్లు
- గత డిసెంబర్ కంటే.. రూ. 44.70 కోట్లు ఎక్కువ
- చివరి నాలుగు రోజుల్లో లిక్కర్ సేల్స్ రూ.22.51 కోట్లు
యాదాద్రి, వెలుగు: డిసెంబర్లో లిక్కర్ ఏరులై పారింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గల్లాపెట్టె నిండిపోయింది. 2024 డిసెంబర్ కంటే ఈసారి లిక్కర్ సేల్స్ విపరీతంగా పెరిగిపోయింది. న్యూ ఇయర్ పేరుతో చివరి నాలుగు రోజుల్లో మరీ ఎక్కువగా సేల్స్ జరిగింది. యాదాద్రి జిల్లాలోని నాలుగు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 82 వైన్స్లు ఉన్నాయి.
ఈ జిల్లా మీదుగా రెండు నేషనల్ హైవేలు ఉండడంతో పాటు హైదరాబాద్కు దగ్గరగా ఉండడం వల్ల లిక్కర్ సేల్స్ ఎక్కువగానే సాగుతాయి. 2023, 2024 డిసెంబర్ కంటే ఈ డిసెంబర్లో సేల్స్ విపరీతంగా జరిగింది. 2023లో లిక్కర్ కేసులు 1,13,109 అమ్ముడుపోగా బీర్ల కేసులు 1,40,132 అమ్ముడుపోయాయి. ఓరాల్గా రూ. 111.17 కోట్ల ఇన్కం వచ్చింది.
2024లో లిక్కర్ కేసులు 94,086, బీర్ల కేసులు 1,23,852 అమ్ముడు పోయాయి. రూ. 93.28 కోట్ల ఇన్కం వచ్చింది. ఈ డిసెంబర్లో లిక్కర్ కేసులు 1,28,116, బీర్లు 1,39,497 కేసులు అమ్ముడు పోయాయి. రూ. 137.98 కోట్ల ఇన్కం వచ్చింది. గత ఏడాది డిసెంబర్ కంటే రూ. 44.70 కోట్ల ఇన్కం అదనంగా
వచ్చింది.
చివరి నాలుగు రోజుల్లో జోష్
న్యూ ఇయర్ వేడుకల్లో లిక్కర్ పాత్ర ఎక్కువే. అందుకే ఏడాది చివర్లో పెద్ద ఎత్తున లిక్కర్ అమ్ముడుపోయింది. 2023 డిసెంబర్ నెలలోని చివరి మూడ్రోజుల్లో రూ. 15 కోట్ల విలువైన లిక్కర్ అమ్ముడుపోగా 2024 డిసెంబర్ 30 నుంచి 31 అర్ధరాత్రి 12 గంటల వరకూ జిల్లాలో లిక్కర్ కేసులు 14,113, బీర్ల కేసులు 9702 సేల్స్ కావడంతో రూ. 14.88 కోట్ల ఇన్కం వచ్చింది. ఈ ఏడాది 28 నుంచి 31 వరకూ లిక్కర్ కేసులు 19,255, బీర్ల కేసులు 22,692 అమ్ముడుపోగా రూ. 22.51 కోట్ల ఇన్కం వచ్చింది.
ఎన్నికల కిక్కు..
2025 డిసెంబర్లో సేల్స్ పెరగడానికి పంచాయతీ ఎన్నికలు ఓ కారణం. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పెద్ద ఎత్తున లిక్కర్ పంపిణీ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువగా పంపిణీ జరిగినట్టు తెలుస్తోంది. ఆ ఎన్నికలు జరిగిన డిసెంబర్లో లిక్కర్ కేసులు 1,13,109, బీర్ల కేసులు 1,40,132 అమ్ముడు పోగా, 2025 డిసెంబర్లో లిక్కర్ కేసులు 1,28,116 , బీర్ల కేసులు 1,39,497 అమ్ముడు పోయాయి. 2024 డిసెంబర్లో ఏ ఎన్నికలు జరగనుందున సేల్స్ తగ్గిపోయింది. మొత్తానికి కొత్తగా వైన్స్ షాపులు దక్కించుకున్న వారికి ఫుల్గా ఇన్కం వచ్చింది.
