యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటల సమయం

యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటల సమయం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి  ఆలయానికి భక్తుల పోటెత్తారు. ఆదివారం కావడంతో యాదాద్రీశ్వరుడిని  దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి నిత్య కళ్యాణంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. 


స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతున్నది.  ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇంబ్బంది కలుగకుండా చూస్తున్నారు.