యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు

 యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులతో పాటు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నరసింహ స్వామిని దర్శించుకోవడానికి బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు.

భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఉచిత దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. లడ్డు ప్రసాదం కౌంటర్లు, కల్యాణ కట్ట వద్ద కూడా భక్తుల కోలాహలం నెలకొంది.

భక్తుల రద్దీని ముందే ఊహించిన ఆలయ సిబ్బంది భక్తలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.