నారసింహుడి ఆదాయం రూ.2.38 కోట్లు

నారసింహుడి ఆదాయం రూ.2.38 కోట్లు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి రూ.2.38 కోట్ల ఆదాయం వచ్చింది.  గత 28 రోజులుగా భక్తులు హుండీల్లో వేసిన నగదు, బంగారం, వెండిని గురువారం లెక్కించారు. ఎస్పీఎఫ్, హోంగార్డుల భద్రత నడుమ హుండీలను కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని ప్రత్యేక హాల్​కు తరలించి  ఆలయ ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షణలో  కౌంటింగ్ నిర్వహించారు.  రూ.2,38,46,282 నగదు రాగా.. 90 గ్రాముల బంగారం, 3 కిలోల 740 గ్రాముల వెండి  వచ్చింది.

748  అమెరికా డాలర్లు, 670 యూఏఈ దిర్హామ్స్, 40 ఆస్ట్రేలియా డాలర్లు, 150 కెనడా డాలర్లు, 80సింగపూర్ , 100 ఇంగ్లాండ్ , 21 సౌదీ అరేబియా , 200శ్రీలంక , 25యూరోప్ , 50 కెన్యా , 200 ఒమన్ , 1012 మలేషియా, 10 నేపాల్ , 1 ఖతార్ , 2 ఉక్రెయిన్ , 240 థాయిలాండ్ కరెన్సీ వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు.