
హైదరాబాద్, వెలుగు: గొల్ల కురుమల కోసం యాదవ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీని యాదవ హక్కుల పోరాట సమితి కోరింది. గురువారం యాదవ పోరాట సమితి అధ్యక్షుడు వంశీ మోహన్ ఆధ్వర్యంలో సమితి సభ్యులు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబును కలిసి విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల్లో యాదవులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
1955 నుంచి 1970 వరకు అమల్లో ఉన్న స్పెషల్ నొమాడిక్ ట్రైబ్ రిజర్వేషన్లను అమలు చేసే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీకి సంబంధించిన డబ్బును ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తామంటూ హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.