నిర్మల్ జిల్లా పెంబి పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు యాదవ కులస్థులు. రాత్రి వివాహ సంబురాల్లో ఇంటి వద్ద డ్యాన్స్ చేస్తున్న వారిని పెంబి ఎస్సై చితకబాదారని ఆరోపించారు యాదవులు. పోలీస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చిన్న పిల్లలను కూడా కొట్టారని ఆందోళన చేశారు. ఇంట్లోకి చొరబడి ఇష్టమొచ్చినట్లు దాడి చేశారని మండిపడ్డారు బాధితులు. తక్షణం ఎస్సై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరిన్ని వార్తల కోసం
త్వరలో జాతిరత్నాలు స్టాండప్ కామెడీ షో
చెన్నైకి ఎదురుందా?