ఉగ్రవాదులకు నిధుల కేసులో యాసిన్ మాలిక్ దోషి 

ఉగ్రవాదులకు నిధుల కేసులో యాసిన్ మాలిక్ దోషి 
  • తీర్పు వెలువరించిన ఢిల్లీలోని ఎన్ ఐఏ కోర్టు 

గ్రవాదులకు నిధులు అందించిన కేసులో జమ్ముకశ్మీర్​ వేర్పాటువాద నాయకుడు యాసిన్‌ మాలిక్‌ను ఢిల్లీలోని పటియాల హౌస్‌ కోర్టు గురువారం (ఈనెల 19న ) దోషిగా తేల్చింది. ఈ నెల 25వ తేదీన యాసిన్​ మాలిక్ కు న్యాయస్థానం శిక్షను ఖరారు చేయనుంది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేశారన్న కేసులో పటియాల ప్రత్యేక ఎన్‌ఐఎ కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

టెర్రర్‌ ఫండింగ్‌ కేసులో తనపై నమోదైన అన్ని అభియోగాలను యాసిన్‌మాలిక్‌ అంగీకరించాడని తెలుస్తోంది. యాసిన్ మాలిక్ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవాలని, అతడి ఆస్తులకు సంబంధించి అఫిడవిట్ ఇవ్వాలని కోర్టు ఎన్ఐఏను ఆదేశించింది. ఈ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్​, హిజ్బుల్​ ముజాహిద్దీన్ చీఫ్​ సయ్యద్​ సలావుద్దీన్​ సహా పలువురు వేర్పాటువాద నేతలపై ఎన్​ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. జ‌మ్ముకశ్మీర్‌లో సంఘ విద్రోహ కార్య‌కలాపాలు న‌డిపేందుకు నిధులు స‌మీక‌రించిన‌ట్లు యాసిన్ మాలిక్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2017కు సంబంధించిన ఈ కేసులో మాలిక్ పై ఢిల్లీ కోర్టులో ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుబంధ అభియోగ పత్రం​ దాఖలు చేసింది. నేరాభియోగం న‌మోదైన నేప‌థ్యంలో మాలిక్ క్ష‌మించాల‌ని కోరారు. 

జమ్ములో జరిగే వేర్పాటువాద కార్యకలాపాల్లో జమ్ముకశ్మీర్​ లిబరేషన్​ ఫ్రంట్​ (జేకేఎల్ఎఫ్)​ ముందుస్థానంలో ఉంటుంది. 1989లో జరిగిన కశ్మీరీ పండిట్​ల హత్యల్లోనూ జేకేఎల్​ఎఫ్​ నాయకుల పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. వీరి దురాగతాలతో కశ్మీర్​ నుంచి భారీ సంఖ్యలో పండిట్​లు వలస వెళ్లారు. 1984లో జరిగిన భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే హత్యతోనూ జేకేఎల్​ఎఫ్​ కు సంబంధాలు ఉన్నాయి.

 

మరిన్ని వార్తల కోసం..

RRRపై వెనక్కి తగ్గిన జీ5..ఎక్స్ ట్రా మనీ అవసరం లేదు

చనిపోయి బతికింది..ఐదుగురికి బతుకునిచ్చింది