RRRపై వెనక్కి తగ్గిన జీ5..ఎక్స్ ట్రా మనీ అవసరం లేదు

RRRపై వెనక్కి తగ్గిన జీ5..ఎక్స్ ట్రా మనీ అవసరం లేదు

ఇండియన్ సినీ చరిత్రలో రికార్డులు సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 20 నుండి జీ5లో రిలీజ్ అవుతోంది. అయితే పే ఫర్ వ్యూ విధానంలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు జీ5 తొలుత ప్రకటించింది. దీనిపై ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం కావడంతో జీ5 వెనక్కి తగ్గింది. జీ5 సబ్ స్క్రైబర్లందరికీ ఈ సినమాను ఉచితంగా చూసేలా వెసులు బాటు కల్పించింది.

 

ఎన్టీఆర్,రాంచరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బంపర్ విక్టరీ కొట్టింది. టాలీవుడ్,బాలీవుడ్ సహా పలు భాషల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను ఓటీటీలో చూడాలంటే సబ్ స్క్రిప్షన్ తో పాటు అదనంగా 100 రూపాయలు చెల్లించాలని జీ5 మొదట ప్రకటించింది. దీనిపై విమర్శలు రావడంతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది జీ5. అభిమానుల కోరిక మేరకు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే ఆర్ఆర్ఆర్ ను చూడొచ్చని ప్రకటించింది.