సమాజానికి జ్ఞాన సంపదను అందించి మార్పు తేవాలని యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచన

సమాజానికి జ్ఞాన సంపదను అందించి మార్పు తేవాలని యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచన

పాలమూరు, వెలుగు: సమాజానికి జ్ఞాన సంపదను అందించి మార్పు తెచ్చేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.  ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో బ్రహ్మకుమారీస్​ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్​ను ఎమ్మెల్యే రిలీజ్​ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంచుకున్న  మార్గం సమాజానికి మేలు చేస్తుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యేను సత్కరించారు. మహదేవి, అనసూయ, వీరమణి, సులోచన, ఉమామహేశ్వరి, భారతి, స్వరూప, విజయలక్ష్మి పాల్గొన్నారు.