ఓబీసీలను కాదు.. ఒవైసీలను అన్నాను

ఓబీసీలను కాదు.. ఒవైసీలను అన్నాను

న్యూఢిల్లీ: ఓబీసీలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఒవైసీపై వ్యాఖ్యలు చేశానని యోగా గురువు రామ్‌‌దేవ్ బాబా చెప్పారు. ఓబీసీలను రామ్‌‌దేవ్ బాబా అవమానించారంటూ ఒక వీడియో వైరల్ కావడం, పతంజలి ఉత్పత్తులను బహిష్కరించండంటూ కొందరు ‘ఎక్స్’లో పిలుపునివ్వడంపై ఆయన తాజాగా వివరణ ఇచ్చారు. తాను బ్రాహ్మణుడినని, అగ్నిహోత్రి బ్రాహ్మణుడని రామ్‌‌దేవ్ పేర్కొన్న ఒక వీడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది.

నాది బ్రహ్మ గోత్రం. నేను అగ్నిహోత్రి బ్రాహ్మణుడను. బాబాజీ ఓబీసీ అని కొందరు అంటుంటారు. నేను వేద బ్రాహ్మణుడను, ద్వివేది బ్రాహ్మణుడను, త్రివేది బ్రాహ్మణుడను, చతుర్వేది బ్రాహ్మణుడను-నేను నాలుగు వేదాలు చదివాను’’ అని మాట్లాడిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై రామ్‌‌దేవ్ స్పందిస్తూ.. తాను ఓబీసీలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఒవైసీ గురించే వ్యాఖ్యానించానని చెప్పారు. ఒవైసీ పూర్వీకులు దేశ వ్యతిరేకులని, ఆయనను సీరియస్‌‌గా తీసుకోనని అన్నారు.