
యోగాకు సరిహద్దులు లేవని, ప్రపంచాన్ని ఏకం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. శనివారం (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం లో నిర్వహిస్తున్న యోగాంధ్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ లోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు లక్షల మందితో ఏర్పాటు చేసిన యోగా వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
యోగా ను ప్రపంయలోని 175 దేశాలు అనుసరిస్తున్నాయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. యోగా గ్లోబలైజ్ కావడం సామాన్యమైన విషయం కాదన్నారు. యోగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవన శైలిని మార్చిందని.. అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదేనని అన్నారు.
యోగాకు సరిహద్దుల్లేవని, వయసుతో పనిలేదని.. అది ప్రకృతి, ప్రగతి సంగమమని కొనియాడారు. యోగాంధ్ర ఈవెంట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏపీ సర్కారుకు అభినందనలు. ప్రజల భాగస్వామ్యానికి ఇదొక స్ఫూర్తిగా నిలిచిందని.. వికసిత్ భారత్ ఆలోచనలకు ఇది రూపమని -ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.