రాజీవ్ గాంధీ కుటుంబం ఐఎన్ఎస్ విరాట్ను టాక్సీలా వాడుకుందని, అందులో ఫ్యామిలీ మొత్తం ఓ ఐల్యాండ్కు పది రోజుల హాలిడే ట్రిప్కు వెళ్లిందని బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్కు కాంగ్రెస్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ జెట్స్ను మోడీ సొంత టాక్సీలా ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారని గురువారం మండిపడింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల వైఫల్యాలు వెంటాడుతుండడంతో ప్రధాని భయపడుతున్నారని, అందుకే తన తప్పులను మరొకరిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఐఎన్ఎస్ విరాట్ను రాజీవ్ గాంధీ ఎప్పుడూ సొంత అవసరాలకు వాడుకోలేదన్నారు. ప్రధాని తన 240 అనధికారిక పర్యటనల కోసం వాడుకున్న ఐఏఎఫ్ జెట్స్ కోసం బీజేపీ ఇండియన్ ఎయిర్ఫోర్స్కు కోటీ 40 లక్షలు చెల్లించిందని చెప్పారు. ఈ ఏడాది జనవరి 15న ప్రధాని పర్యటనకు వాటిన జెట్కు కేవలం రూ.744 చెల్లించారని ఆరోపించారు. ‘ప్రధాని చెప్పింది అబద్ధం. రాజీవ్ కేవలం అధికార కార్యక్రమాలకే విరాట్లో ప్రయాణించారు. అది విహారయాత్ర కాదు. మోడీ నిజాలను పట్టించుకోరు’ అని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా దుయ్యబట్టారు. ఇండియన్ నేవీ వైస్ అడ్మినరల్ వినోద్ పశ్రిచా కూడా ఆనాడు రాజీవ్ అధికారిక కార్యక్రమాలకే విరాట్ను ఉపయోగించుకున్నారని చెప్పారన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన దివంగత ప్రధాని రాజీవ్పై విమర్శలు చేయడం ప్రధాని మోడీకి తగదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అహ్మద్ పటేల్ ట్వీటర్లో కామెంట్ చేశారు. రాబోయే ఫలితాలను తలచుకుని ప్రధాని మోడీ భయపడుతున్నారని, వాళ్ల అబద్ధపు ప్రచారాలు చివరిదశకు చేరాయని ఎన్సీపీ జనరల్ సెక్రటర్ శంకర్సింగ్ వాఘేలా విమర్శించారు.
జెట్స్ను సొంత టాక్సీలా వాడుతున్నది మోడీనే : కాంగ్రెస్
- దేశం
- May 10, 2019
లేటెస్ట్
- ఏంటీ కిరాతకం : పట్టపగలు.. నడి రోడ్డుపై వ్యాపారిపై కాల్పులు
- రణరంగం : పోలీస్ స్టేషన్ లో భార్యభర్తలు మృతి.. స్టేషన్ తగలబెట్టిన గ్రామస్తులు
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- Vishwanetha: తెరపైకి మోదీ బయోపిక్.. విశ్వనేతగా కట్టప్ప
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
- తక్కువ ధరకే ఫ్లాట్స్ .. జనానికి రూ.60 కోట్లు టోకరా
- V6 DIGITAL 18.05.2024 AFTERNOON EDITION
- Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం..ఆ జాబితాలో తొలి భారతీయ నటిగా గుర్తింపు
- T20 World Cup 2024: టీమిండియాతో పాటు ఆ మూడు జట్లు సెమీస్కు చేరతాయి: జైషా
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు