- మద్రాస్ మోటార్ రేసింగ్ ట్రాక్లో
- బైక్ స్కిడ్ కావడంతో ప్రమాదం
చెన్నై: యువ బైక్ రేసర్ కొప్పరం శ్రేయాస్ హరీశ్ మృతి చెందాడు. శనివారం చెన్నైలోని ఇరుంగట్టుకోట్టైలో జరిగిన నేషనల్ మోటార్ సైకిల్ రేసింగ్ ఛాంపియన్షిప్ (ఎన్ఎంఆర్సీ)లో మద్రాస్ మోటార్ రేసింగ్ ట్రాక్లో ప్రమాదానికి గురయ్యాడు. రేస్లో 200సీసీ బైక్ నడుపుతుండగా మూడో రౌండ్ లో బైక్స్కిడ్ అయి కిందపడిపోయాడు. అదే సమయంలో హెల్మెట్ కూడా ఊడిపోవడంతో అతడి తలకు బలమైన గాయమైంది. వెంటనే శ్రేయాస్ ను ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయిందని, అప్పటికే చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు.
ఈ ఏడాది మేలో స్పెయిన్లో జరిగిన బైక్ రేసింగ్లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరిన తొలి ఇండియన్ గా13 ఏండ్ల శ్రేయాస్ చరిత్ర సృష్టించాడు. 'ది బెంగళూరు కిడ్' గా పాపులర్అయిన శ్రేయాస్.. జులై 26న శ్రేయాస్తన 13వ పుట్టినరోజును జరుపుకున్నాడు. శ్రేయాస్ మృతితో వీకెండ్లో జరగాల్సిన రేసులను మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ రద్దు చేసింది. శ్రేయాస్ ఇండియాలో జరిగిన ఎఫ్ఐఎం మినీ జీపీలో పాల్గొని తన కేరీర్ను ప్రారంభించాడు. 2022లో చాంపియన్ షిప్ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత, అతను నేషనల్ చాంపియన్ షిప్లో పాల్గొన్నాడు.