స్నాచింగ్ చేసిన ​యువ జంట అరెస్ట్​

స్నాచింగ్ చేసిన ​యువ జంట అరెస్ట్​
  • మూడు రోజుల కింద ఎరుగండ్లపల్లిలో గోల్డ్​చైన్​తెంపుకెళ్లిన యువతీయువకుడు
  • ఇద్దరూ హైదరాబాద్​వాసులే
  • 3.5  గొలుసు,1.5 తులాల నల్లపూసల తాడు స్వాధీనం 

కొండమల్లేపల్లి (మర్రిగూడ), వెలుగు: చైన్​స్నాచింగ్​లకు పాల్పడుతున్న జంటను అరెస్ట్​చేసినట్టు నల్గొండ జిల్లా నాంపల్లి సీఐ నవీన్ కుమార్ తెలిపారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఎస్సై రంగారెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. మూడు రోజుల కింద మర్రిగూడ మండలం ఎరుగండ్లపల్లిలో టూ వీలర్​పై వచ్చిన నిందితులు సాతు సునీత మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును తెంపుకెళ్లారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఓ చోట సీసీ ఫుటేజీలో దొరికిన స్నాచర్ల జంట ఫొటోను పోలీసులు సర్క్యులేట్​చేశారు. వారిని పట్టుకోవడానికి స్పెషల్​టీమ్స్​ను రంగంలోకి దింపారు. ఆదివారం మర్రిగూడ పరిధిలోని సరంపేట ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా స్కూటీపై యువకుడు,  యువతి వచ్చారు. పోలీసులను చూడగానే పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో వారిని పట్టుకుని విచారించగా చైన్ స్నాచింగ్​కు పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. 

బెట్టింగులకు అలవాటు పడి... 

చైన్ స్నాచింగ్ చేసిన నిందితులిద్దరిని హైదరాబాద్​లోని సంతోష్ నగర్​కు చెందిన సభావాత్ వెంక టేశ్, సభావాత్ కుమారి గా గుర్తించారు. సభావత్​కుమా రికి వివాహమైంది. వీరు బెట్టింగ్ లు, వ్యసనాలకు అలవాటు పడి పలు స్నాచింగ్స్​చేస్తున్నారు. 3.5తులాల బంగారుగొలుసు,1.5 తులాల నల్లపూసల తాడు, నలుపు రంగు స్కూటీ స్వాధీనం చేసుకొని రిమాండ్​కు తరలించారు. కేసును ఛేదించిన ఎస్సై రంగారెడ్డి, సిబ్బందిని నల్గొండ ఎస్పీ చందన దీప్తి, దేవరకొండ డీఎస్పీ గిరిబాబు అభినందించారు.