ప్రియురాలు మోసం చేసిందని యువకుడి సూసైడ్?

ప్రియురాలు మోసం చేసిందని యువకుడి సూసైడ్?

అనంతపురం : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ యువతి చివరకి తన కొడుకుని మోసం చేయడంతోనే సూసైడ్ చేసుకున్నాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. అనంతపురం, కొవ్వూరు నగర్ కు చెందిన ప్రణయ్ అనే యువకుడు కెనడాలో ఉంటున్నాడు. అయితే ప్రణయ్ రెండ్రోజులు క్రితం నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనపై అనంతపురంలో ఉంటున్న ప్రణయ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ప్రణయ్ కి పరిచయమై ఓ యువతి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కరోనా టైంలో ఇప్పేడే వద్దంటూ మోసం చేసిందని ఆరోపించారు.

యువతి మోసం చేసిందని తన కొడుకు ప్రణయ్ సూసైడ్ చేసుకునే ముందు వీడియోలో చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రణయ్ మృతిపై పలు అనుమానాలున్నాయని..యువతి, ఆమె తల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రణయ్ తండ్రి నారాయణస్వామి డిమాండ్ చేస్తున్నారు. ప్రణయ్ డెడ్ బాడీనీ కెనడా నుంచి అనంతపురాని తీసుకొస్తున్నామని తెలిపారు.   ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.