
నాగర్ కర్నూల్, వెలుగు: కార్తీక సోమవారం సందర్భంగా నదీ స్నానానికి వెళ్లిన యువకుడు నీట మునిగి చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన చందన్కుమార్(22) కుటుంబంతో కలిసి సోమవారం నాగర్కర్నూల్జిల్లా కొల్లాపూర్మండలం సోమశిల పుణ్యక్షేత్రానికి వెళ్లాడు. అక్కడి కృష్ణా నదిలో స్నానానికి దిగిన చందన్ కుమార్ లోతు తెలియక నీట మునిగాడు. చివరి కార్తీక సోమవారం కావడంతో నదీ తీరంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో యువకుడు మునిగిపోవడం ఎవరూ గమనించలేదు. తర్వాత గుర్తించిన కొందరు భక్తులు యువకుడిని బయటికి తీసుకొచ్చారు. వెంటనే కొల్లాపూర్ గవర్నమెంట్హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు ఓ ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీలో ఎంప్లాయ్ అని తెలిసింది.