యాక్టివా నుంచి ఎగిరిపడి.. ఇద్దరు యువకులు మృతి

యాక్టివా నుంచి ఎగిరిపడి.. ఇద్దరు యువకులు మృతి

కంటోన్మెంట్​,వెలుగు: యాక్టివా పై వెళ్తుండగా జరిగిన యాక్సిడెంట్​లో ఇద్దరు యువకులు చనిపోయిన ఘటన సికింద్రాబాద్​పరిధిలో జరిగింది. బోయినపల్లికి చెందిన శరత్(21), రాహుల్(19)లు ఫ్రెండ్స్. వీరు శనివారం రాత్రి 11గంటల సమయంలో హోండా యాక్టివాపై తాడ్ బండ్​ నుంచి బోయినపల్లికి వెళ్తుండగా గ్రేవ్​యార్డు టర్నింగ్​వద్ద స్కిడ్​అవగా ఎగిరి అవతలి వైపు రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో బోయిన్ పల్లి నుంచి తాడ్​బండ్​ వెళ్తున్న ఇన్నోవా కారు వీరిని ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడడంతో  సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు వారు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. దీంతో బోయిన్​పల్లి పోలీసులు పోస్టుమార్టం కోసం డెడ్​బాడీలను  గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఇన్నోవా డ్రైవర్​ను అరెస్ట్​ చేసి కేసు ఫైల్​చేశామని బోయిన్​పల్లి ఇన్​స్పెక్టర్ రవికుమార్​ తెలిపారు.