
కూకట్పల్లి, వెలుగు: కూకట్ పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువకుడు కరెంట్ షాక్ తో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాగ్యనగర్కాలనీకి చెందని జ్ఞానేశ్వర్(37) స్థానిక అడ్డా వద్ద ఆటో పెట్టుకొని, షటిల్ సర్వీసులు నడుపుతుంటాడు. స్థానిక సాయిబాబా ఆలయ నిర్వాహకులు గురుపౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం మధ్యాహ్నం ఏర్పాట్లు చేస్తున్నారు.
వారికి సహకరించేందుకు జ్ఞానేశ్వర్ ఆలయ కమాన్ ఎక్కి ఫ్లెక్సీ కడుతున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్వైర్లకు తగలడంతో షాక్కొట్టి, అక్కడికక్కడే మృతిచెందాడు. తర్వాత మంటలు పక్కనే ఉన్న బార్ అండ్ రెస్టారెంట్కు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని, మంటలను ఆర్పివేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.