మిర్యాలగూడలో పాలస్తీనా జెండాను ప్రదర్శించిన యువకులు

మిర్యాలగూడలో పాలస్తీనా జెండాను ప్రదర్శించిన యువకులు

మిర్యాలగూడ, వెలుగు:  నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో శుక్రవారం కొంతమంది యువకులు పాలస్తీనా జెండాను ప్రదర్శించారు. రెడ్డి కాలనీలోని బ్లూ వేల్  ప్యాలెస్  వద్ద ఈ ఘటన జరిగింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వన్ టౌన్  పోలీసులు ఆ యువకులను స్టేషన్ కు తరలించారు. వారికి కౌన్సెలింగ్  ఇచ్చి వదిలేశామని వన్ టౌన్  సీఐ రాఘవేందర్  తెలిపారు.