- కరోనా నుంచి కోలుకున్నా పాణం దక్కలే
గోదావరిఖని, వెలుగు: కరోనా నుంచి కోలుకున్నా ఓ యువతి ప్రాణం దక్కలేదు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని కృష్ణానగర్లో ఉండే కాంట్రాక్టర్ రవీందర్రెడ్డి కూతురు కరీష్మారెడ్డి(28). అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఎనిమిదేండ్లుగా అక్కడే ఉంటోంది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో 2 నెలల క్రితం ఇండియాకు వచ్చింది. వచ్చిన 10 రోజులకు కరోనా సోకడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. నెగెటివ్ వచ్చిన
కొన్నిరోజులకే హెల్త్ ఇష్యూస్ రావడంతో హాస్పిటల్కు వెళ్లగా టెస్టుల్లో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరిందని తెలిసింది. అప్పటి నుంచి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయింది.