పోలీసుల ఫోన్ కాల్..? యువకుడు సూసైడ్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం

పోలీసుల ఫోన్ కాల్..? యువకుడు సూసైడ్..  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం

పోలీసులు ఫోన్ చేయడంతో భయాందోళకు గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. జరిమానా చెల్లించకోపతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని పోలీసులు చెప్పటంతో క్షణికావేశంలో ప్రాణం తీసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ముదిగొండ కు చెందిన ఇరుకు గోపి (25) అనే యువకుడు శనివారం (జూన్ 21) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది క్రితం ఖమ్మం ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకున్న గోపి.. భార్యతో కలిసి కొత్తడూడెంలో నివసిస్తున్నాడు. తన భార్య కొత్తగూడెంలో నర్సింగ్ కోర్సు చేస్తుండడంతో, అక్కడే నివసిస్తూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

ఇటీవల మద్యం సేవించి బండి నడపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డాడు. శనివారం పోలీసులు ఫోన్ చేసి కోర్టులో హాజరు కావాలని, జరిమానా కట్టకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.

►ALSO READ | బంగారం వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు

దీంతో భయాందోళనకు గురైన గోపి.. కొత్తగూడెంలో తాను కిరాయికి ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రాఫిక్ పోలీసుల బెదిరింపుల కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు మృతుడి భార్య ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.