సిద్ధార్థ్ రాయ్‌‌‌‌కి యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు

సిద్ధార్థ్ రాయ్‌‌‌‌కి యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు

 దీపక్ సరోజ్, తన్వి నేగి జంటగా వి యశస్వీ రూపొందించిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్‌‌‌‌’. జయ ఆడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించిన  సినిమా ఫిబ్రవరి 23న విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోందని తెలియజేస్తూ మేకర్స్ సక్సెస్‌‌‌‌ మీట్‌‌‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా దీపక్ మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచి  అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నా క్యారెక్టరైజేషన్‌‌‌‌కి చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. 

దర్శకులు యశస్వీ విజన్‌‌‌‌ను  ప్రేక్షకులు ఇష్టపడ్డారు. ఇది రెగ్యులర్ సినిమా కాదు. ఓ కొత్త కథని చూడాలనుకునే ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తుంది’ అని చెప్పాడు.  ఆడియెన్స్‌‌‌‌  నుంచి వస్తున్న ఆదరణ చాలా ఆనందాన్ని ఇస్తోందని చెప్పింది తన్వి. యశస్వీ మాట్లాడుతూ ‘అన్ని ఏరియాల నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యూత్‌‌‌‌ ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అవుతున్నారు’ అని చెప్పాడు.  మంచి సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉందని నిర్మాతలు అన్నారు.