పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. దుండగులు పార్లమెంటు కాంప్లెక్స్లోకి ఎలా ప్రవేశించారనేది అతిపెద్ద ప్రశ్నగా మిగిలిపోయిందన్నారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్కు వ్యతిరేకంగా జరిగిన భారత కూటమి నిరసనలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. హోంమంత్రి అమిత్ షా నుంచి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్న సమయంలో.. వికృతంగా ప్రవర్తించినందుకు ఎంపీలను సస్పెండ్ చేశారు.
లోక్ సభలో స్మోక్ అటాక్ కు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోన్న పరిణామాలేనని, నిరుద్యోగమే ప్రధాన కారణమని ఇటీవల రాహుల్ గాంధీ మండిపడగా.. తాజాగా ఆయన మరోసారి కేంద్రంపై మాటల దాడి చేశారు. పార్లమెంట్ లో ఖచ్చితంగా భద్రతా ఉల్లంఘన జరిగిందని, వారి నిరసనకు కారణం నిరుద్యోగమేనని రాహుల్ మరోమారు వాదించారు. దేశంలోని యువత సోషల్ మీడియాలో ఎన్ని గంటలు గడుపుతున్నారో సర్వే చేయమని సర్వేలు చేసే ఓ వ్యక్తికి చెప్పానని.. ఈ సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయన్నారు.
యువత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొదలైనవాటిలో రోజులో దాదాపు ఏడున్నర గంటలు గడుపుతున్నారని తెలిసి ఆశ్చర్యపోయానని.. ఎందుకంటే.. నరేంద్ర మోదీ యువతకు ఉపాధి కల్పించలేదని రాహుల్ ఆరోపించారు. మోదీ వారికి సెల్ ఫోన్లు చూసే అవకాశం మాత్రమే ఇచ్చారని, వారు పార్లమెంటు భవనంలోకి దూకడం వెనుక మీ (ప్రభుత్వ) తప్పే ఉందని ఆయన అన్నారు. నిరుద్యోగంపై ప్రశ్నలు అడిగితే 150 మందిని ఎగదోశారని.. ఇది ఒక్క వ్యక్తి కాదని, దేశంలోని 60 శాతం మంది ప్రజల గొంతుకని రాహుల్ అన్నారు. అగ్నివీర్ యోజనను తీసుకొచ్చి.. యువతలో దేశభక్తి భావనను దూరం చేశారని విమర్శించారు.
#WATCH | At INDIA bloc protest at Jantar Mantar, Congress' Rahul Gandhi says, "2-3 youth entered Parliament and released smoke. At this BJP MPs ran away. In this incident, there is the question of security breach, but there is another question of why they protested this way. The… pic.twitter.com/ll5K8Sp3gp
— ANI (@ANI) December 22, 2023