
జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్టణంలోని రెండోవార్డు సాయి రెసిడెన్సీ ప్రెసిడెంట్స్కూల్వెనకాల పట్టణానికి చెందిన గో గ్రీన్ఉద్యమం చేపడుతున్న పంతం సాయి ప్రసాద్ఆధ్వర్యంలో ఆదివారం యువకులు మొక్కలు నాటారు. యువకులు మాట్లాడుతూ పచ్చదనం కోసం 10 వేల మొక్కలను నాటడానికి పథకం రూపొందించామని తెలిపారు. కార్యక్రమంలో పంతం వసంతలక్ష్మి, సిద్దార్ధ, సాయి, చరణ్ తదితరులు పాల్గొన్నారు.