ఫ్రీ రెస్టారెంట్ ఓపెన్ చేసి, డబ్బులు పంచుతుండు

ఫ్రీ రెస్టారెంట్ ఓపెన్ చేసి, డబ్బులు పంచుతుండు

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వచ్చాక టాలెంట్ ను నిరూపించుకోవడానికి అంత ఎక్కువ టైమేం పట్టడం లేదు. తమ సృజనాత్మకతను ట్విట్టర్, ఇన్స్ స్టాగ్రామ్ లాంటి మైక్రో బ్లాగింగ్ సైట్లతో షేర్ చేసుకుంటూ పాపులర్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్లలో ఒకరు అమెరికన్ యూట్యూబర్ జిమ్మీ డొనాల్డ్‌సన్. తన క్రియేటివిటీతో వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో అత్యంత వ్యూస్ వచ్చిన వీడియో కంటెంట్ క్రియేటర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అతని ప్రతీ వీడియో 10 మిలియన్లకు పైగా వ్యూస్ వస్తాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి వీడియోనే తాజాగా యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ప్రపంచంలోనే మొదటిసారి ఉచిత బర్గర్ రెస్టారెంట్ ప్రారంభించానని క్రియేటర్ వీడియోలో తెలిపారు. అంతే కాదు తినడానికి వచ్చే వారికి డబ్బు కూడా చెల్లిస్తున్నానని కూడా స్పష్టం చేశారు. అతను చెప్పినట్టుగానే  షాప్ కు వచ్చే వారికి డబ్బు కూడా చెల్లిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే ఈ వీడియో 20 డిసెంబర్ 2020న పబ్లిష్ కాగా..  రీసెంట్ గా వార్తల్లో వినిపిస్తోంది.