ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరు కాలేదు. జగన్ హాజరు కావడం లేదని జగన్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వారు మరొకసారి డిస్పెన్స్ పిటిషన్ దాఖలు చేశారు. అధికారిక కార్యక్రమాల్లో ఉన్నందున హాజరు కాలేకపోతున్నట్లు వారు చెప్పారు. ఆ పిటిషన్ ను స్వీకరించిన సీబీఐ కోర్టు.. శుక్రవారం కోర్టు హాజరు పై జగన్ కు మినహాయింపు ఇచ్చింది. ఆస్తుల కేసును జనవరి 24 కు వాయిదా వేసింది.
More News