దొర.. మీ జ్వర రాజకీయం అదుర్స్

దొర.. మీ జ్వర రాజకీయం అదుర్స్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోమారు మండిపడ్డారు. దేశంలో భూకంపం తెప్పిస్తానన్న కేసీఆర్.. ప్రధాని మోడీ హైదరాబాద్ కు వస్తే ఎందుకు కలవలేదని ఆమె ప్రశ్నించారు. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారని మోడీకి ఎదురుపడి ఎందుకు అడగలేదని క్వశ్చన్ చేశారు. ‘బండ బూతులు తిట్టిన నోటితో బాగున్నారా అని అడగలేకపోయారా? చీరుతా అన్న చేతులతో నమస్కారం పెట్టలేకపోయారా? పోయినుంటే మోడీ, కేసీఆర్ ఢిల్లీ దోస్తానీ మరోసారి బయటపడుతుందని పోలేదా? అందుకే జ్వరం వంక పెట్టుకొని డుమ్మా కొట్టారా? సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణకు పోని పాపాన్ని కడుక్కోవడానికి ఈరోజు యాదాద్రి యాగానికి వెళ్ళారా?’ అని ట్విట్టర్ వేదికగా షర్మిల ప్రశ్నించారు. బాగుంది దొరగారు మీ జ్వర రాజకీయమని ఆమె దుయ్యబట్టారు. 

మరిన్ని వార్తల కోసం:

వైరల్ అవుతున్న ‘శ్రీవల్లి’ ఇంగ్లిష్ వెర్షన్

జేఎన్‌యూ వీసీగా తెలుగు మహిళ

డేరా బాబాకు పెరోల్