వైఎస్‌ను కించపరిస్తే.. అభిమానులు కేసీఆర్ భరతం పడ్తరు

వైఎస్‌ను కించపరిస్తే.. అభిమానులు కేసీఆర్ భరతం పడ్తరు

బంగారు తెలంగాణ తెస్తామని చెప్పిన కేసీఆర్ బారుల, బీరుల  తెలంగాణగా మార్చారన్నారు. ఎంజీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 50 శాతం స్టాఫ్ తో యూనివర్సిటీ నడుస్తోందన్నారు. వైఎస్సార్ స్థాపించిన యూనివర్సిటీలో  ఉపాధ్యాయులు లేరన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 33 శాతం, తెలంగాణలో ఏ యూనివర్సిటీలో చూసినా 60 శాతం ఖాళీలు ఉన్నాయన్నారు. 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ముస్లింలకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు. ముస్లింలకు ఎక్కువగా ద్రోహం చేసింది సీఎం కేసీఆరేనన్నారు. విద్య వ్యవస్థను సీఎం కేసీఆర్ బ్రష్టు పట్టిస్తున్నారన్నారు. యూనివర్సిటీ భూములపై టీఆర్ఎస్ నాయకుల కన్ను పడిందన్నారు. వైఎస్సార్ ని కించపరిస్తే ఉరుకోబోమని.. ఆయన అభిమానులు కేసీఆర్ భరతం పడతారన్నారు.

మరిన్ని వార్తల కోసం

క్వారంటైన్‌లో బిడ్డకు జన్మనిచ్చిన శ్రియ

అసెంబ్లీలో ఈటల మొహం చూడకూడదని కేసీఆర్ కుట్ర