భట్టి విక్రమార్కను కలిసిన వైఎస్‌ షర్మిల

భట్టి విక్రమార్కను కలిసిన వైఎస్‌ షర్మిల

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఏపీ కాంగ్రెస్ నాయకురాలు వైఎస్‌ షర్మిల ప్రజాభవన్ లో కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి రావాలని  భట్టి విక్రమార్కను ఆమె ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు షర్మిల శుభలేఖను అందించారు.  

అనంతరం ఇరువురు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు. రాజారెడ్డి పెండ్లి అట్లూరి ప్రియతో నిశ్చయమైంది. ఈనెల18న ఎంగేజ్ మెంట్, వచ్చే నెల 17న పెళ్లి ఫిక్స్ అయింది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం, ఏపీ సీఎంతో సహా పలువురు రాజకీయ ప్రముఖులకు ఇప్పటికే షర్మిల శుభలేఖలు అందించారు.  

వైఎస్‌ రాజా రెడ్డి అమెరికాలోని డ‌ల్లాస్ యూనివ‌ర్సిటీలో బ్యాచిల‌ర్ ఆండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ కోర్సును పూర్తి చేశారు. యూనివ‌ర్సిటీ నుంచి ఇటీవల ప‌ట్టా కూడా అందుకున్నారు.  ప్రియా అట్లూరి కూడా అమెరికాలోని పేరున్న విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. దగ్గరి బంధువులను నిశ్చితార్దానికి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.