భద్రాద్రి కొత్తగూడెం: ఎస్సీ, ఎస్టీలను కేసీఆర్ పురుగుల్లా చూస్తున్నారని, వాళ్ల అభివృద్ధిని కోసం కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవడంలేదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా భద్రాద్రిలో పర్యటిస్తున్న షర్మిల మాట్లాడుతూ... కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రాజెక్టులు కట్టారని, ప్రాజెక్టులో పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో ఏం అభివృద్ధి చేశారని... దేశాన్ని ఏలబోతున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారని కేసీఆర్ ను ప్రశ్నించారు. ప్రతిపక్షాలు తమ బాధ్యతను మరిచాయి కాబట్టే... రాష్ట్రంలో కేసీఆర్ ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారిందన్నారు. బంగారు తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, నిరుద్యోగులకు ఆత్మహత్యలు మిగిలాయని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన నిలబడి, పోరాడేందుకే తాను పార్టీ పెట్టానని స్పష్టం చేశారు. వైఎస్సార్ హయాంలో అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం పట్వారిగూడెంలో 1,050 ఇండ్లు కట్టించి ఇచ్చారని గుర్తు చేశారు. అంతే కాకుండా అత్యధికంగా పోడు పట్టాలు ఇచ్చింది కూడా వైఎస్సారేనని చెప్పారు. ఇప్పుడు తమ పార్టీ ఆధ్యర్యంలో వైఎస్సార్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నామన్నారు.
YSR ఏది అడిగినా లేదనకుండా ఇచ్చేవారు. ఇదే అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం పట్వారిగూడెంలో 1,050 ఇండ్లు కట్టించి ఇచ్చారు.ఇదే మండలంలో అత్యధికంగా పోడు పట్టాలు ఇచ్చారు.బంగారు తెలంగాణలో KCR కుటుంబానికి 5 ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఆత్మహత్యలు మిగిలాయి.1/2#PrajaPrasthanam #Day72 pic.twitter.com/N57AmZojTg
— YS Sharmila (@realyssharmila) May 1, 2022
మరిన్ని వార్తల కోసం...